ప్రతిసారీ సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకలు దుబాయ్లో అంగరంగ వైభవంగా సాగుతాయన్న సంగతి తెలిసిందే. ఈసారి ఆగస్టులో ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే వీటిల్లో పాల్గొనడానికి ఏ సెలబ్రిటీలు వెళ్లాలి? ఎవరికి అర్హత ఉంది? అన్నది ఓ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే దుబాయ్ లాంటి ఖరీదైన నగరంలో అడుగుపెట్టి అవార్డుల వేదికపై తళుక్కుమని మెరవాలని ఎవరికి ఉండదు?
అందుకే నటీనటులు, సాంకేతిక నిపుణులు భారీగా లాబీలకు రెడీ అవుతుంటారు. అయితే ఈ ఏడాది అలాంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఆర్గనైజర్స్ సన్ నెట్వర్క్ టీమ్కి ఎంపికల ప్రక్రియను అప్పజెప్పారట. ఆ మేరకు టెన్షన్లను వదలగొట్టేసుకున్నట్లే. మొహమాటానికి పోయి అందరికీ ఆహ్వానం ఇవ్వడం కుదరదు కాబట్టి, ఇలా ప్లాన్ చేశారనమాట. ప్రస్తుతం ఫిలిం నగర్లో దీని గురించే చర్చ.