Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 17:12:06
facebook Twitter Googleplus
Photo

ఒక్క అమ్మాయి తప్ప సినిమా కోసం హీరో సందీప్ కిషన్ పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. అలాగే ఆయన మావయ్య సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు కూడా పైసా ఛార్జ్ చేయలేదు.. ఇక నిత్యా మీనన్ కూడా చాలా తగ్గించి తీసుకుంది. ఇదండీ వరుస. ఇప్పుడు ఈ న్యూస్ తో ఆ సినిమా ప్రమోషన్ ను అదరగొట్టాలని చూస్తున్నారు.

కాకపోతే మనోళ్ళకి అర్ధం కాని విషయం ఏంటంటే.. ఇలాంటి ప్రమోషన్లకే సినిమాలకు మిస్ ఫైర్ అవుతాయి. ఒక ప్రక్కన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తరువాత అసలు తెలుగులో సందీప్ కిషన్ కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. అందుకే తనే దగ్గరుండి ఒక ప్రొడ్యూసర్ ను సెట్ చేసి ఈ సినిమా చేస్తున్నాడని టాక్. అలాంటప్పుడు లాభాల్లో వాటాలు ఇస్తారు కాని.. రెమ్యూనరేషన్ ఎవరిస్తారు? అలాగే తన మేనల్లుడికి ఎలాగైనా ఈసారి సక్సెస్ రావాలని చోటా.కె.నాయుడు ఈ సినిమాను ఫ్రీగా చేసుంటారు. ఇక నిత్యా మీనన్ అంటారా.. తక్కువ రోజుల్లో షూటింగ్ అంటే ఆమె మాత్రం భారీగా ఎందుకు ఛార్జ్ చేస్తుంది? సో లాజికల్ వీళ్ళందరూ జీరో పేమెంట్ కే పనిచేశాం ఈ కథపై మక్కువతో అని చెబితే.. అది ఎక్కడా సింక్ అవ్వట్లేదు మరి.

మొన్నామధ్యన ''క్షణం'' సినిమాతో మీరు హిట్టు కొట్టారుగా అంటే.. అబ్బే మేమందరం కలసి ఈ సినిమాను బ్రేకిచ్చాం అన్నాడు అడివి శేష్. కట్ చేస్తే.. ఆ సినిమాలో నటించిన అదా శర్మ - అనసూయ - ఇలా ఎవ్వరికీ ఇంకా బ్రేకే రాలేదు. మరో సినిమానే పడలేదు. వింటున్నావా సందీప్??

,  ,  ,  ,  ,