Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2015 10:29:45
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం అనేక విశేషాలతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమాలో గాయని సునీత ఒక పాత్రలో నటించడానికి అంగీకరించిందనే వార్తలు ఇటీవల షికారు చేశాయి. ఆమె మహేష్ బాబుకి 'వదిన' పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఈ పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. ఈ పాత్రకి ఆమె చాలా బాగుంటుందనే అభిప్రాయాలు అప్పుడే వినిపిస్తున్నాయి.

బుల్లితెరపై యాంకర్ గా .. సినీ గాయనిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె ఏ రంగంలోకి అడుగుపెట్టినా అందులో రాణించడమే ఇప్పటివరకూ జరుగుతూ వచ్చింది. దీనిని బట్టి నటిగా కూడా ఆమె మంచిమార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు. సునీత ఈ సినిమాలో చేయడమంటూ జరిగితే, తెలుగు తెరకి ఓ అందమైన నటి దొరికినట్టేనని చెప్పుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,