ఆమధ్య 'బీరువా' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ సురభి తాజాగా తెలుగులో మరో అవకాశం అందుకుంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఫేం మేర్లపాక గాంధీ తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్ హీరోగా చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా మొదట్లో హిమాని సిసోడియాను ఎంచుకున్నారు. అయితే, తాజాగా ఆమెను డ్రాప్ చేసుకుని, సురభిని తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది.
sharwanand, merlapakagandhi, expressraja, news, surabhi,