ప్రస్తుతం రవితేజ హీరోగా నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'కిక్ 2' చిత్రానికి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. దీని తర్వాత కూడా కల్యాణ్ రామ్ కు మరో చిత్రాన్ని చేయడానికి ఈ దర్శకుడు అంగీకరించాడట. అయితే, అందులో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తాడు. సురేందర్ రెడ్డి తొలిచిత్రం 'అతనొక్కడే'. ఇందులో కల్యాణ్ రామ్ హీరోగా నటించడమే కాకుండా, దానిని నిర్మించాడు కూడా. అలా తనకు తొలి అవకాశమిచ్చిన కల్యాణ్ రామ్ ను హీరోగా నిలబెట్టడానికి ఓ చిత్రం చేస్తానని ఈ దర్శకుడు చెప్పాడట. సో, త్వరలో ఇది కూడా సెట్స్ కి వెళుతుందన్న మాట!
kalyanram, surenderreddy, newmovie, tollywood, news,