Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 12:34:22
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ ఇండస్ట్రీ ని నాలుగు పెద్ద తలకాయలు ఏలుతూ , మిగతా వాళ్లని తొక్కేస్తున్నారనే వాదన ఎప్పటినుండో వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ నలుగురు కాస్త ముగ్గురయ్యారనే వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరు సురేష్ బాబు. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ ను నడిపిస్తూ , ఆంధ్రా , సీడెడ్ ఏరియాల్లో కొన్ని వందల థియేటర్స్ ను మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సీన్ మారిందట. ఇంతకాలం తన వెంట ఉన్నవారే ఇప్పుడు తనకు వెన్నుపోటు పొడుస్తుండడం తట్టుకోలేకపోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్ లో వినపడుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాతలు ఎవరు అంటే అల్లు అరవింద్, దిల్‌రాజ్, యూవీ క్రియేషన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి సురేష్ బాబు తొక్కేస్తున్నారట. రెండేళ్ల కిందటి వరకు దిల్‌రాజుకి ఒక్క వైజాగ్‌లో మాత్రమే ఆఫీస్ ఉండేది. యూవీ క్రియేషన్స్ వారు గుంటూరుకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటూ ఆ ప్రాంతంపై మంచి పట్టు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ అల్లు అరవింద్ జత కలిసి తన బిజినెస్ మైండ్ తో ఆంధ్రా, సీడెడ్‌లోని థియేటర్లన్నీ తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు.

దీంతో సురేష్ బాబు చేతులో ఉన్న థియేటర్స్ అన్ని ఇప్పుడు ఈ ముగ్గురి చేతులోకి పోవడం తో ఏం చేయాలో తెలియక అయోమయం లో ఉన్నాడు. దీంతో సురేష్ బాబు పెద్దగా సినిమాలు నిర్మించడం మానేశాడు. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలను పంపిణీ చేద్దామని చూస్తూన్నా, అల్లు అరవింద్ బ్యాచ్ అంతా కలిసి సురేష్ బాబు చేతికి రాకుండా చేస్తున్నారట. దీంతో నా వెంట తీరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచారని తన అనుకున్న వారి దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడట.

,  ,  ,  ,  ,