మూడు సినిమాలు విడుదలవ్వతున్నాయంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద విచిత్రం. ఎందుకంటే ఈ మధ్యన మనోళ్లు అసలు పోటీలేకుండా ఎవరికి వారు సింగిల్ గా వస్తున్నారు. కాని ఈసారి ఎందుకో ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా ఆగస్టు 11నే ఎంచుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి.. లై.. జయ జానకి నాయక సినిమాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రేడ్ వర్గాల నుండి ధియేటర్ల పంపిణీపై ఒక మాట వినిపిస్తోంది.
లై మరియు జయ జానకి నాయక సినిమాలను మేజర్ ఏరియాల్లో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా పంపిణీ సురేష్ బాబు చూసుకుంటున్నారు. అయితే దిల్ రాజు రెండు సినిమాల్లో ఒక దాన్ని కాస్త పోస్టుపోన్ చేయమని అడిగారట. కాకపోతే ఈ రెండూ పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టి.. రాజు పోస్ట్ పోన్ చేయనన్నారట. అందుకు సురేష్ బాబు ఫీలయ్యి ఇప్పుడు తను కూడా డేటు మార్చకుండా.. అదే రోజున తెస్తున్నాడట. అంతేకాదు.. తన పలుకుబడి ఉపయోగించి ఎక్కువ ధియేటర్లు నేనే రాజు నేనే మంత్రి సినిమాకే ఇప్పించుకున్నాడని మార్కెట్లో టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై రకరకాలు మీడియాల్లో కూడా వేర్వేరు ఊహాగానాలు వస్తున్నాయి.
సర్లేండి.. ఎక్కువ ధియేటర్లు ఇచ్చుకున్నంత మాత్రాన మార్నింగ్ షో కు నాలుగు టిక్కెట్లు ఎక్కువ తెగుతాయేమో కాని.. ఆ తరువాత నడిపించేది కంటెంటేగా.