తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ?ఎస్-3?. ?సింగ్? సిరీస్లో వస్తున్న మూడో సీక్వెల్ ఇది. ?సింగమ్-3? నే సంక్షిప్తంగా ?ఎస్-3? అంటున్నారు. ఇప్పటికే ?సింగం?, ?సింగం2? సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మూడో స్వీకెల్పైనా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళనాడు థియేటర్ ప్రదర్శన హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ?ఎస్-3? థియేట్రికల్ హక్కులు రూ. 41 కోట్లకు అమ్ముడుపోయాయని, ?సింగం-2? భారీ విజయం నేపథ్యంలో రికార్డు ధరకు సినిమా హక్కులు హాట్ కేక్లా అమ్ముడుపోయాయని చిత్రవర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన శృతి హాసన్, అనుష్క షెట్టి నటించనున్నారు.