వరుసగా 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాల విజయాలతో కథానాయిక స్వాతి డిమాండు పెరిగింది. తెలుగులో కన్నా తమిళ, మలయాళ భాషల్లో బిజీ అయిపోయింది. అందుకే, నాగార్జున పక్కన నటించే అవకాశం వచ్చినా చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిన్నది 'గీతాంజలి' సీక్వెల్ లో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం. అంజలి ప్రధానపాత్రధారిగా ఆమధ్య వచ్చిన 'గీతాంజలి' మంచి హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు రాజ్ కిరణ్ ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నాడు. ఇందులో నటించడానికి అంజలి భారీ మొత్తాన్ని డిమాండు చేయడంతో, ఆమెను పక్కన పెట్టి, స్వాతిని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
coloursswati, geetanjali, sequel, tollywood, news,