క్యాన్సర్ బాధితులను ఆదుకునెందుకు, క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచెందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ ఎగైన్ పెరుతో ఓ సోషల్ ఆర్గనెజైషన్ ను ప్రారంభించారు.. హైమా రెడ్డి ఈ సంస్థ కు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు.. కాగా ఇటీవలె లైఫ్ ఎగైన్ వెబ్ సైట్ ను ఎంపి కె.కవిత ఆవిష్కరించారు..
క్యాన్సర్ వ్యాధితో ప్రతి యోటా కోట్ల సంఖ్యలో ప్రజలు మృత్యవ్యాత పడుతున్నారు.. వారిలో కొందరినైనా కాపాడేందుకు, మరింతమందిలో క్యాన్సర్ పై అవహాగాన తెచ్చెందుకు లైఫ్ ఎగైన్ తరపున చెస్తోన్న ఈ క్యాంపెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ తరహా సేవకు ముందికొచ్చిన గౌతమి మరియు హైమా రెడ్డి కృషి విజయవంత మవ్వాలని కె.కవిత ఆకాంక్షించారు..
ఇక ఈ లైఫ్ ఎగైన్ క్యాంపెనింగ్ కార్యక్రమంలో నటులు కమల్ హాసన్, జగపతి బాబు, మమతా మోహన్ దాస్ లాంటి సినీ ప్రముఖులు తో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు సపోర్ట్ చెస్తున్న విషయం విదితమే..