Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 11:34:03
facebook Twitter Googleplus
Photo

ఈ తమిళ మీడియా అండ్ జర్నలిస్టులు ఉన్నారే.. వీళ్ళకు ప్రాంతీయాభిమానం పిచ్చి పీక్స్ లో ఉంటుంది. వారి దృష్టిలో ఎలాంటి సినిమాకైనా కూడా చెన్నయ్ లో ప్రెస్ మీట్ పెడితేనే అది ప్రెస్ మీట్ అవుతుంది. లేదంటే మాత్రం వారు దాని గురించి కామెడీ కామెడీలు చేస్తారు. చివరకు అక్కడుంది సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా కూడా.. మనోళ్ళు సెటైర్ల వర్షం కురిపించేస్తారు.

నిన్న సాయంత్రం ముంబయ్ లో సూపర్ స్టార్ కొత్త సినిమా ''2.0'' ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం చోటుచేసుకుంది. ఈ ప్రోగ్రామ్ కు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్టుగా రాగా.. బాలీవుడ్ మీడియా అంతా విచ్చేసింది. ఈవెంట్ జరుగుతున్న హాలు మీడియాతో కిక్కిరిసిపోయింది అంటే చూడండి మరి. అయితే ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తామని ముందే చెప్పారు నిర్మాతలు లైకా ఎంటర్టయిన్మెంట్ వారు. కాకపోతే ఈవెంట్ జరుగుతుండగా.. ఈ లైవ్ స్ర్టీమింగ్ ఆగిపోయింది. ఏదో టెక్నికల్ ఎర్రర్ వచ్చిందట. ఇదే అదునుగా చూసుకున్న తమిళ జర్నలిస్టులు రెచ్చిపోయారులే.

''350 కోట్లు గుమ్మరించి ఒక సినిమాను తీశారు. కాని లైవ్ ఈవెంట్ స్ర్టీమ్ చేయలేకపోయారు. అంత డబ్బులు పెట్టి ఉపయోగం ఏంటి?'' అని కొందరు జర్నలిస్టులు అడుగుతుంటే.. వారికి మద్దతుగా నాజర్ వంటి నటులు 'అవును' అనడం.. ఇలాంటి కామెడీలో చేస్తున్నారు అరవ బ్యాచ్. లైవ్ టెలికాస్ట్ ఫెయిల్ అయితే సినిమా బడ్జెట్ మీద కామెంట్లా??? వీళ్లకంటే అతిగాళ్లు ఉండరు బాబా!!

,  ,  ,  ,  ,  ,