తమిళ, తెలుగు భాషల్లో హీరోగా కొనసాగుతున్న కార్తీ ఇప్పుడు క్లౌడ్ నైన్ మీద విహరిస్తున్నాడు. ఇతడి ఈ ఆనందానికి కారణం, ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం దక్కడమే! 'ఓకే బంగారం' సినిమా విజయం తర్వాత మణిరత్నం కొత్త ఉత్సాహంతో వెంటనే మరో సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ప్రాజక్టుకి తాజాగా కార్తీని హీరోగా ఎంచుకున్నాడట. ఈ సినిమా విషయంలో కార్తీ ఇటీవల వెళ్లి మణిని కలిశాడని, ప్రాజక్టు దాదాపు ఓకే అయిందని అంటున్నారు. విశేషం ఏమిటంటే, కార్తీ తన సినిమా కెరీర్ ని మణి వద్దే ప్రారంభించాడు. సూర్య హీరోగా మణి రూపొందించిన యువ సినిమాకి కార్తీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
karthi, maniratnam,