మోస్ట్ ఫేవరెట్ యంగ్ కపుల్ నాగచైతన్య - సమంతల వివాహానికి టైం దగ్గర పడుతోంది. ఓవైపు షూటింగ్ పనులు చకచకా పూర్తి చేస్తూనే మరోవైపు మ్యారేజ్ అరేంజ్ మెంట్స్ ను చూసుకుంటున్నారు. చైతూ - సమంతల పెళ్లి వేడుక అక్టోబరు 6న గోవాలోని ఖరీదైన రిసార్ట్ లో జరగనుంది. ఈ పెళ్లికి దగ్గరి బంధువులు - స్నేహితులతోపాటు అతిథులను పరిమితంగానే ఆహ్వానిస్తున్నారు.
ఇకపోతే ఎవరెవరిని ఆహ్వానించాలి... ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నది కాబోయే వధూవరులే స్వయంగా డీల్ చేస్తున్నారు. గోవా రావాల్సిందిగా ఎవరిని పిలవబోతున్నారా అని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పెళ్లి వేడుకకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా హీరో రామ్ చరణ్ తేజ్ లను చైతు - సమంత కలిసి ఆహ్వానించినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో ఈ ముగ్గురు హీరోలు కుటుంబాలతో సహా బయలుదేరి గోవా వెళ్లే అవకాశముంది. టాలీవుడ్ లో మరికొందరు ప్రముఖులకు కూడా త్వరలో ఆహ్వానం అందనుంది. ఈ ముగ్గురు హీరోలు ప్రేమజంటకు బాగా క్లోజ్ కావడంతో వీరిని ముందుగానే పర్సనల్ గానే ఇన్వైట్ చేశారట.
పెళ్లి వేడుక పూర్తయిన మూడురోజుల తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. టాలీవుడ్ కోలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోని ప్రముఖులకు సైతం రిసెప్షన్ కు ఇన్వైట్ చేస్తున్నారు. పెళ్లి పనులు మొత్తం కాబోయే జంటకు వదిలిపెట్టిన నాగార్జున తన ఫుల్ ఫోకస్ రిసెప్షన్ పైనే పెట్టాడు.