Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 13:07:52
facebook Twitter Googleplus
Photo

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ.. జాగ్వార్ మూవీతో సినీ అరంగేట్రం చేస్తున్నాడు. శాండల్ వుడ్ చరిత్రలోనే 75 కోట్ల అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని.. కన్నడతో పాటు తెలుగు-తమిళ్ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించిన స్టోరీ.. ఈ చిత్రంపై ఆసక్తి పెంచుతుండగా.. నిఖిల్ నెక్ట్స్ మూవీ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

నిఖిల్ రెండో సినిమా ఓ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో ఉంటుందని.. జాగ్వార్ నిర్మాత-నిఖిల్ తండ్రి అనౌన్స్ చేసేశాడు. ఇప్పటికే ముగ్గురు దర్శకులతో మాటా మంతీ కూడా పూర్తయిపోయాయట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివ.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లతో.. కుమారస్వామి సమావేశం అయ్యి.. డిస్కషన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. జాగ్వార్ రిలీజ్ అయిన తర్వాత.. మరుసటి ప్రాజెక్ట్ పై అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మరోవైపు నిఖిల్ రెండో సినిమాని 2017 జనవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో కూడా ఈ కుర్రాడికి మార్కెట్ క్రియేట్ చేసే వ్యూహంతోనే.. ఇలా తెలుగు సినిమా డైరెక్టర్ ని ఫిక్స్ చేయాలని నిర్ణయించారట. ఇదిలా ఉంటే.. జగపతిబాబు లీడ్ రోల్ లో ఓ సినిమా చేయనున్నట్లు కుమారస్వామి చెప్పడం విశేషం. అంతే కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తానన్నాడీ జాగ్వార్ ప్రొడ్యూసర్

,  ,  ,  ,  ,