సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు త్రిష కృష్ణన్.. హన్సిక మొత్వానిలిద్దరికీ ఒకేసారి పెద్ద షాక్ తగిలింది. వీళ్లిద్దరి ఫోన్లను ఎవరో హ్యాక్ చేశారు. మొత్తం డేటా అంతా లాగేసి.. ఫోన్లను బ్లాంక్ చేసేయడంతో వీళ్లిద్దరూ షాక్ తిన్నారు. ముందుగా హ్యాకింగ్ బారిన పడింది త్రిషనే. తన ఫోన్లో ఒక్కసారిగా డేటా అంతా మాయమైపోవడంతో ఆమె కంగుతింది. వెంటనే సోషల్ మీడియాలో దీని గురించి అప్ డేట్ పెట్టింది. ఎవడో పిరికిపంద తన ఫోన్ ను హ్యాక్ చేశాడని.. వాడి సంగతి సైబర్ క్రైమ్ వాళ్లు.. దేవుడు చూసుకుంటాడని.. దయచేసి తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ల వాళ్ల నంబర్లు తనకు వాట్సాప్ చేయాలని త్రిష కోరింది.
త్రిష ఇలా అప్ డేట్ పెట్టిన కాసేపటికే హన్సిక సైతం తనకూ ఇదే ఇబ్బంది ఎదురైందని వెల్లడించింది. తన మిత్రులు కూడా వాట్సాప్ ద్వారా నంబర్లు పంపాలని కోరింది. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేసిన హ్యాకర్ ఎవరా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఫోన్లలో పర్సనల్ డేటా చాలా ఉంటుంది కాబట్టి ఈ హీరోయిన్లద్దరూ టెన్షన్ పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ హ్యాకర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సెలబ్రెటీల్ని ఇలా టార్గెట్ చేసి.. వాళ్ల పర్సనల్ డేటా లాగేసే ప్రబుద్ధులు ఈ మధ్య చాలామందే తయారయ్యారు. కాబట్టి ఫోన్లో పెట్టే డేటా విషయంలో సెలబ్రెటీలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే.