చెన్నయ్ భామ త్రిష కొత్త అవతారం ఎత్తుతోంది. మానసిక సమస్యలతో సతమతమయ్యే వారికి తన మాటలతో సాంత్వన చేకూర్చే మానసిక నిపుణురాలి పాత్రను పోషిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'మేము' సినిమాలో ఈ చిన్నది ఈ తరహా పాత్రను ధరిస్తోంది. పాండ్యన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ఇందులో త్రిష ప్రధాన పాత్ర పోషిస్తుండగా పూనం భజ్వా, ఓవియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, వరుణ్ మణియన్ తో తన వివాహం రద్దవడంతో అమ్మడు కొత్త సినిమాలకు వరుసగా సంతకాలు చేసేస్తోంది.
trisha, newmovie, news, tollywood, kollywood,