గత కొద్దికాలంగా హీరోయిన్ ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోన్న త్రిష, తాజాగా ?నాయకి? అనే సినిమాను విడుదలకు సిద్ధం చేయడమే కాక, ?మోహిని? అనే మరో సినిమాను కూడా సెట్స్పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. లండన్లో ఈమధ్యే మోహిని సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ను పూర్తి చేసిన టీమ్, త్వరలోనే థాయ్లాండ్లో మరో షెడ్యూల్ మెదలుపెట్టనుంది. త్వరలోనే ఈ థాయ్లాండ్ షెడ్యూల్ మొదలవుతుందని టీమ్ తెలిపింది. ఆర్.మధేష్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా మోహిని తెరకెక్కుతోంది.
ఇక ?నాయకి?, ?మోహిని? రెండూ హర్రర్ సినిమాలే కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. మోహినిలో త్రిష ఓ చెఫ్గా కనిపించనున్నారు. ఇందుకోసం కొంతకాలం ఆమె చిన్న రీసెర్చ్ కూడా చేశారట. ఓ సరికొత్త కథాంశంతో, మంచి హర్రర్ సినిమాగా మోహిని ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఇక నాయకి సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.