పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఖాయమైన సంగతి గతంలోనే చెప్పేసుకున్నాం. ఇప్పటికే పవన్ తో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసుుకుంటున్నాడు త్రివిక్రమ్. స్టోరీ లైన్ పై ఇప్పటికే ఓ తుది రూపు వచ్చేయగా ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసుకునే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ పై కూడా ఇప్పటికే ఓ అంచనా వచ్చేసినట్లు తెలుస్తోంది.
పవన్-త్రివిక్రమ్ ల మూవీకి అక్షరాలా వంద కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారట. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డుల్లో నిలవనుండగా.. ఇప్పటికే 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ కి త్రివిక్రమ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. కామెడీ.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు అటు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు ఫినిష్ కాగానే.. దేవుడే దిగివచ్చినా చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేయనున్నారట. వంద కోట్ల బడ్జెట్ అంటే అటు పవన్ కళ్యాణ్ కి.. ఇటు త్రివిక్రమ్ కి కూడా వారి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ కానుండడంతో.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని ద్విభాషా చిత్రంంగా తెరకెక్కించేదుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.