మిస్టర్ షూటింగ్ లో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ గాయపడ్డ విషయం తెలిసిందే. అక్టోబర్ 1న గాయంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వరుణ్ నేరుగా ఇంటికి చేరుకొని విశ్రాంతి తీసుకొంటున్నాడు. ఇంటికొచ్చి వారమైంది. ఇంకా గాయం నయం కాలేదు. దీంతో బోర్ గా ఫీలవుతున్నాడు ఈ మెగా హీరో. ?ఇంట్లోనే ఉండడంతో బోర్ కొడుతోంది.. ఎంటర్టైన్మెంట్ ప్లీజ్?? అని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలోని ప్రేక్షకులకు విన్నవించుకున్నారు.
వరుణ్ గాయంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ?మిస్టర్?. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ?ఫిదా? చిత్రాల షూటింగ్ నిలిచిపోయింది. వరుణ్ కోలుకున్న తర్వాత ఈ రెండు చిత్రాలు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనున్నాయి. ఈ రెండు చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకొన్నాడు వరుణ్. ఇందులో ఒక్కటైన హిటైతే కెరిర్ మరింత ఊపందుకోవడం ఖాయమని భావిస్తున్నాడు