ఇప్పుడు ఒక మెగా న్యూస్ బాగా చెక్కర్లు కొట్టడం.. తరువాత అది కాదంటూ అందరూ ఖండించడం.. ఇదే ఆనవాయితీగా మారింది. ఇందులో ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే.. మెగా ఫ్యామిలీకి సన్నిహితులు అయినవారే కొన్ని వార్తలను చెప్పడం.. చివరకు వారే అది ఖండించడం. ఇప్పుడు ఖైదీ నెం 150 అండ్ ధృవ సినిమాల గురించి అలాంటి రెండు న్యూస్ ల గురించి చూద్దాం పదండి.
నిజానికి ధృవ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెన్యూ కాని.. అలాగే ఖైదీ నెం 150 ఆడియో ఫంక్షన్ వెన్యూ కాని ఇంకా ఓకె అవ్వలేదు. కాని కొన్ని 'మెగా' మీడియా వర్గాలు మాత్రం.. ఈ రెండు సినిమాల ఆడియో వెన్యూలను చెప్పుకుంటూ వచ్చాయి. కట్ చేస్తే వారే సాయంత్రానికి అబ్బే అది రాంగ్ అనేశారు. ఎందుకంటే మధ్యలో రామ్ చరణ్ పి.ఆర్.ఓ.లు డైరెక్టుగా ఎటువంటి న్యూస్ నమ్మొద్దని.. త్వరలోనే అన్నీ మేమే ప్రకటిస్తాం అని చెప్పారు. సో స్వయంగా చెర్రీ టీమ్ ఇలా చెప్పడంతో.. అస్సలు గతంలో మెగా హీరోల గురించి చాలా విషయాలను రివీల్ చేసిన టీమ్ లన్నీ మెగా షాక్ తినేస్తున్నాయి.
అయితే చరణ్ ఇలా అన్ని విషయాలనూ స్వయంగా చేతిలోకి తీసుకుని.. తన కొత్త సినిమాల రిలేటెడ్ పబ్లిసిటీ యవ్వారలను తనే చూసుకుంటున్నాడు. దీనికి స్పెషల్ కారణం ఏంటనేది తెలియదు కాని.. చెర్రీ మాత్రం షాకిచ్చేస్తున్నాడు.