తెలుగు, తమిళ భాషల్లో హీరోగా స్టార్ స్టేటస్ ఉన్న విక్రమ్, కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కొత్త సినిమా ?ఇరు ముగన్? ఎలాగైనా పెద్ద హిట్గా నిలుస్తుందని అభిమానులు సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో నటించినవారందరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాను తెలుగులోనూ క్రేజ్ తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఈ క్రమంలోనే సింగపూర్లో జరగుతున్న సైమా వేడుకల్లో ?ఇరు మగన్? తెలుగు టీజర్ను విడుదల చేయనున్నారు. ఇక టీజర్తో పాటు టైటిల్ను కూడా ఈ సాయంత్రమే సైమా వేడుకలోనే ప్రకటించనున్నారు. ఇందుకోసం టీమ్ అంతా ఇప్పటికే సైమా వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకుంది. ఓ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళంలో ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళంలో ఒకేసారి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది