Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2016 16:39:18
facebook Twitter Googleplus
Photo

నూత‌న న‌టీన‌టులు రుద్ర‌, వెన్నెల జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం వీరి వీరి గుమ్మ‌డి పండు. ఈ చిత్రాన్ని కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 26న వీరి వీరి గుమ్మ‌డి పండు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..
వీరి వీరి గుమ్మ‌డి పండు చిత్ర ద‌ర్శ‌కుడు ఎం.వి.సాగ‌ర్ మాట్లాడుతూ...ఇది ఓ డిఫ‌రెంట్ ఫ్యామిలీ హ‌ర్ర‌ర్ మూవీ. ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది. ఒక ఇంట్లో దెయ్యం ఉంద‌ని తెలిసిన త‌ర్వాత అసలు దెయ్యం ఎవ‌రిలో ఉంద‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా 63 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నాం. కథ డిమాండ్ మేరనే ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకున్నామంతే. సినిమా కథ విషయానికి వస్తే ఓ 16 మంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే కుటుంబం దెయ్యం వల్ల ఎలాంటి వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుందనేదే కథ. నేను దర్శకత్వం నేర్చుకోవడానికి ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. ఫస్టాఫ్ లో ముందు పదిహేను నిమిషాల్లో క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేసేస్తాం. తర్వాత అసలు సినిమాలో ఎంటరవుతుంది. ఇంటర్వెల్ కు ముందు ఇంట్లో దెయ్యముందని తెలుస్తుందని, సెకండాఫ్ లో ఎవరి ఒంట్లో దెయ్యముందనేదే కథ. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా పక్కా ప్లానింగ్ తో సినిమా చేశాం. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూశాడని కచ్చితంగా చెబుతారు. అమీర్ పేటలో కొంతమందికి ప్రివ్యూ వేసి చూపించాం. వారంతా చాలా కొత్తగా ఉందంటూ కామెడి ఎంజాయ్ చేసేలా ఉందని అన్నారు. 2013లో ప్రేమ క‌థా చిత్ర‌మ్, 2014లో గీతాంజ‌లి 2015లో రాజు గారి గ‌ది ఎంత‌టి విజ‌యాన్ని సాధించాయో...2016 లో మా చిత్రం వీరి వీరి గుమ్మ‌డి పండు ఆ సినిమాల‌ స్ధాయిలో విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం అన్నారు.

,  ,  ,