Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2015 16:58:32
facebook Twitter Googleplus
Photo

కుర్ర హీరోలతో తీసిన సినిమాలే వైవీయస్ చౌదరికి మంచి రిజల్ట్ ని అందించాయి. అందుకే ప్రతీసారీ తన సినిమాలతో కొత్త హీరోల్ని పరిచయం చేయడానికే ఆసక్తి చూపుతుంటాడు. `రేయ్`తోనూ అదే చేశాడు. కానీ ఆ చిత్రం సరైన ఫలితాన్ని తీసుకురాలేదు. అయినా సరే ఈసారి కూడా ఆయన అదే తరహాలో మరో ప్రయత్నం చేయాలని కథని సిద్ధం చేసుకొన్నాడు. ఈసారి దేవదాసు - సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమాల తరహాలో ఓ పక్కా లవ్ స్టోరీని తీయాలని చౌదరి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో కథానాయకుడిగా రాజ్ తరుణ్ ని ఎంచుకొన్నట్టు సమాచారం.

రాజ్ తరుణ్ ఇటీవల జోరుమీదున్నాడు. చేసిన రెండు సినిమాలూ సక్సెస్ కావడం సుకుమార్ లాంటి దర్శకుడితో కుమారి 21 ఎఫ్ సినిమా చేయడంతో అందరి దృష్టీ రాజ్ తరుణ్ పై పడింది. తనకి కథకు తగ్గట్టుగా ఉండటంతో పాటు బిజినెస్ విషయంలోనూ మంచి హైప్ ఉంటుందని భావించిన వైవీయస్ చౌదరి రాజ్ తరుణ్ కి కథ వినిపించాడట. కథల విషయంలో రాజ్ తరుణ్ పక్కాగా ఉంటాడు. వైవీయస్ చెప్పిన కథ బాగుండటంతో రాజ్ తరుణ్ వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ కాంబినేషన్ లో సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రేయ్ తో ఆర్థికంగా చాలా నష్టాలు చవిచూసిన చౌదరి మళ్లీ తన సొంత సంస్థలో సినిమా చేస్తాడా లేక వేరే నిర్మాతని వెదుక్కొన్నాడో చూడాల్సి వుంది.

,  ,  ,