ఆమధ్య 'ఐ' వంటి భారీ చిత్రాన్ని రూపొందించిన తమిళ దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రంగా మరో భారీ ప్రాజక్టును చేబడుతున్నాడు. 'రోబో' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటిస్తాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు పని చివరి దశకు చేరిందని అంటున్నారు. ఇందులో రజనీ తన వయసుకు తగ్గా పాత్రను పోషిస్తాడు. ఆయనకు విలన్ గా షారుఖ్ ఖాన్ నటిస్తాడని వార్తలొచ్చినప్పటికీ, ఇందులో ఆయన చేయడం లేదని తాజా సమాచారం. దాంతో ఆ పాత్రకు మరో హీరో విక్రంను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ ప్రాజక్టుకు 300 కోట్ల బడ్జెట్టు వెచ్చిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
rajnikanth, shankar, vikram, kollywood, news, robot2, 300crore,