Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2015 11:25:07
facebook Twitter Googleplus
Photo

నలభైల్లో కూడా వన్నె తరగని అందంతో మిలమిలా మెరిసిపోతున్న బాలీవుడ్ సుందరి ఐశ్వర్యారాయ్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి సన్నద్ధమవుతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 'రావోయి చందమామ' సినిమాలో నాగ్ తో కలసి ఓ పాటలో నర్తించిన ఈ సౌందర్యరాశి, ఇప్పుడు ఓ భారీ తెలుగు సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. నాగార్జున, మహేష్ బాబు హీరోలుగా మణిరత్నం తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ మల్టీ స్టారర్ ప్రాజక్టును చేబడుతున్నట్టు, అందులో ఓ కథానాయికగా ఐష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని, మరో కథానాయికగా శ్రుతిహాసన్ ఇప్పటికే ఎంపికైందని అంటున్నారు. గతంలోనే సెట్స్ కి వెళ్లవలసిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ మణిరత్నం ఈ ప్రాజక్టుపై సీరియస్ గా ఉన్నాడని, ఇటీవలే ఐష్ తో ఈ సినిమా గురించి మాట్లాడాడని తెలుస్తోంది. దీనిని ఐశ్వర్య కూడా ధ్రువీకరించినట్టు బాలీవుడ్ నుంచి వార్తలు వస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,