ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడం ఎంత కష్టమో.. ఆ స్థాయిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. పైగా ప్రతీ సినిమాకి సక్సెస్ సాధించాల్సిన అవసరం.. సినిమాకి సినిమాకి పెరిగే అంచనాలను అందుకోవడం చాలా చాలా క్లిష్టమైన విషయం. విజయాలు సాధించడానికి అన్నిటి కంటే ముఖ్యం స్టోరీ సెలక్షన్. ఈ విషయంలో ప్రస్తుత తరంలో ఏ స్టార్ తో పోల్చినా.. అల్లు అర్జున్ మాత్రం తనదైన స్టైల్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు.
గతేడాది వచ్చిన సరైనోడు మూవీతో బన్నీ 70కోట్లకు పైగా షేర్ సాధించాడు. కానీ బన్నీ కంటే ముందు పలువురు పెద్ద హీరోలకే ఈ కథ వినిపించాడు బోయపాటి. ఈ విషయంలో బన్నీ చేసిన రిస్క్.. ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు కారణమైంది. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం చాలామందినే సంప్రదించాడు గుణశేఖర్. కానీ కేమియో చేసి.. మొత్తం అటెన్షన్ అంతా తనవైపునకు తిప్పుకోగలిగాడు. ఆ మూవీ రేంజ్ ని పెంచి హిట్ పట్టాలు ఎక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం వక్కంతం వంశీతో చేస్తున్న సినిమా పరిస్థితి కూడా ఇలాంటిదే. అనేక సూపర్ హిట్ చిత్రాలకు స్టోరీ ఇచ్చిన రైటర్ వక్కంతంకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు.
ఇక జూన్ 23న విడుదల కానున్న డీజే-దువ్వాడ జగన్నాధంది కూడా సేమ్ సిట్యుయేషన్