తన తదుపరి సినిమాను ఇంకా ప్రకటించలేదు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటివరకు ఇంకా ''సరైనోడు'' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. గడచిన నాలుగుసార్లు.. క్రిటిక్స్ మనోడి సినిమాను యావరేజ్ అనడం.. మనోడేమో 50 కోట్లు వసూలు చేయడం మామూలే అయిపోయింది. ఈసారి ఏకంగా 60 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మరి.
ఇకపోతే బన్నీ తన తదుపరి సినిమాగా.. విక్రమ్ కె కుమార్ డైరక్షన్ లో చేయబోతున్నాడా లేకపోతే లింగుస్వామితో చేయబోతున్నాడే అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. విక్రమ్ తో సినిమా చేస్తాడేమో అని ఒక నమ్మకం. ఎందుకంటే.. మొదటగా విక్రమ్ చెప్పిన మనం కథను సూర్య వదులుకున్నాడు. తరువాత 24 కథను మహేష్ బాబు వదులుకున్నాడు. కాని ఆ రెండు సినిమాలూ ఐకానిక్ అయిపోయాయ్. అలాంటప్పుడు బన్నీ తనకు చెప్పిన కథను వదులుకుంటే.. అది వేరే హీరో చేసి.. సినిమా హిట్టయితే.. తను ఒక మాంచి సినిమా మిస్సయిపోయాను అంటూ భయపడాల్సిందేగా.
కాని గీతా ఆర్ట్స్ క్యాంప్ నుండి వినిపిస్తున్న కూకూలు ప్రకారం.. ఏ సినిమా అయినా కూడా పక్కాగా స్ర్కిప్టు తన దగ్గరకు వచ్చాకనే బన్నీ డెసిషన్ తీసుకుంటాడట. అంటే చాలా రోజులు ఖాళీగా ఉండబోతున్నాడనమాట.