అనుష్క శెట్టి గురించి ఈ మధ్య తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. ఎంగేజ్మెంట్ కి ప్రిపేర్ అవుతోందని.. డిసెంబర్ లో నిశ్చితార్ధం ఖాయమని.. ఇలాంటి ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ పుకార్లే అని ఇప్పుడు తేలిపోగా.. అమ్మడు మళ్లీ తన ఫిజిక్ పై దృష్టి పెట్టే పనిలో ఉందని తెలుస్తోంది.
బాహుబలి మూవీ కోసం సుదీర్ఘ కాలం కేటాయించిన అనుష్క.. ఆ తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి భాగమతి మూవీ చేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోగా.. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు ఉండగా.. ఇప్పుడు అనుష్క చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. చేసేందుకు ఒప్పుకోవాలే కానీ.. నిజానికి అనుష్కకు అవకాశాలకేమీ కొదువ ఉండదు. అయినా సరే.. ఉద్దేశ్యపూర్వకంగానే గ్యాప్ తీసుకుంటోందట అనుష్క. సైజ్ జీరో తర్వాత మారిపోయిన కొలతలను సరి చేసుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు కేరళ వెళ్లి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేయించుకోనుందని తెలుస్తోంది.
తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఇలాగే తన బరువును తగ్గించుకోవడంలో బాగానే సక్సెస్ అయింది. మరీ నాజుకు అనేయకపోయినా.. కనిపించే స్థితిలోనే లావు తగ్గింది. అందుకే ఇప్పుడు అనుష్క కూడా కేరళకే ప్రయాణం కడుతోందట. ఆల్రెడీ ఈ అమ్మడు కేరళలో వాలిపోయిందని.. బరువు తగ్గించుకునే చికిత్సలను మొదలుపెట్టేసిందని టాక్ వినిపిస్తోంది.