నాగార్జున లేటెస్ట్ మూవీ ప్రారంభమైంది. రాజుగారి గది2 తర్వాత రెండు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న నాగ్.. ఇప్పుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసేశారు. పోలీస్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తొలిసారిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేసేశారు కూడా.
అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. నాగ్ తో హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన టబును హీరోయిన్ గా తీసుకుంటారని తొలుత టాక్ వచ్చింది. కానీ ఈ విషయాన్ని దర్శకుడు వర్మ ఖండించేశాడు. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాటల ప్రకారం.. టాప్ బ్యూటీ అనుష్కను నాగార్జునకు జోడీగా ఎంపిక చేశారట. ఇప్పటికే స్వీటీతో మాటామంతీ కూడా పూర్తయిపోయాయని.. త్వరలోనే అగ్రిమెంట్స్ కూడా చేసుకోనున్నారని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
నిజానికి బాహుబలి ది కంక్లూజన్ తర్వాత అనుష్క ఒక్క మూవీ కూడా అంగీకరించలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న భాగమతి కూడా.. గతంలో అంగీకరించిన ప్రాజెక్టే.