మల్లు భామ కేథరిన్ వరుస అవకాశాలతో అదరగొడుతోంది. దాంతో మొన్నటిదాకా తమిళంలోనే సినిమాలు చేస్తూ గడిపిన ఆమె ఇప్పుడు తన మకాంని టాలీవుడ్కి మార్చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ?సరైనోడు?లో యంగ్ ఎమ్మెల్యే పాత్ర పోషించాకే ఆమె దశ తిరిగిందని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. అందులో కేథరిన్ నటన అందరినీ ఆకట్టుకుంది. దాంతో దర్శకుల దృష్టి మరోసారి ఆమెపై పడినట్టయింది. ఇటీవల గోపీచంద్ సరసన నటించే అవకాశం ఆమెని వరించినట్టు సమాచారం. అంతలోనే రానాతో కలిసి నటించే మరో అవకాశాన్ని కూడా అందుకొంది. తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో కాజల్తో కలిసి కేథరిన్ తెరను పంచుకొంటోంది. సాయిధరమ్ తేజ్ సరసన కూడా ఆమె నటించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Catherina, Tollywood, Movie, Offers, Mater, Tollywood,