వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే 150 సినిమా గతనెల 29 పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. తరువాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎటువంటి వార్త బయటకి రాలేదు. కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు అన్నీ సిద్ధం అయినప్పటికీ కేవలం ఎండ తీవ్రత దృష్ట్యా ముందుగా అనుకున్నట్లు మే నెలలో కాకుండా జూలై నెలలో సినిమా ప్రారంభించాలనుకున్నట్లు తెలిసింది.
ప్రముఖ కెమరామేన్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్తో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.