ఒక్క సినిమా ఒక యాక్టర్ కి లైఫ్ ఇవ్వడం సంగతేమో కానీ.. ఒక్కోసారి ఒక్క డైలాగ్ కూడా ఇంత పవర్ ని చూపించగలదు. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగిన పృథ్వీని.. అందరూ 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ' అంటున్నారంటే.. అందుకు కారణం ఖడ్గం మూవీలో ఇతగాడు చెప్పిన ఆ డైలాగ్. ఇప్పుడు మళ్లీ అలాంటి అవకాశం పెళ్లిచూపులు చిత్రంలో కమెడియన్ గా నటించిన కమెడియన్ కి దక్కింది.
పెళ్లిచూపులులో కామెడీ యాక్టర్ గా నటించిన ప్రియదర్శి పులికొండ.. ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయాడు. 'నా చావు నే చస్తా.. నీకెందుకు' అంటూ ఇతగాడు స్లాంగ్ తో పలికిన తీరు అందరినీ కడుపుబ్బ నవ్వించేసింది. ఇదే ఇప్పుడు భారీ ఆఫర్ల బాట పట్టించింది. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాలో.. ఓ కమెడియన్ గా నటించిన ఇతగాడికి.. ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే మాటలా?
మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో ప్రియదర్శికి ఆఫర్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ వెంట కనిపించే ఓ పాత్రకు కొత్త కమెడియన్ ని తీసుకుందామని దర్శకుడు భావిస్తుండగా.. డైరెక్టర్ కంట్లో పడ్డాడు ప్రియదర్శి. అంతే ఆఫర్ ఇంటికొచ్చింది.. ప్రియదర్శి మహేష్ మూవీలోకి వెళ్లిపోయాడు. ఇవాల్టి నుంచి ఈ మూవీ షూటింగ్ చైన్నైలో జరగనుండగా.. ఫ్యామిలీ టూర్ ముగించుకుని దుబాయ్ నుంచి వచ్చిన మహేష్ నేరుగా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.