కుటుంబ కధా చిత్రాలకు నేటితరం పెట్టినపేరుగా నిలిచిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఒకానొక టైమ్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. మధ్యలో ఫామ్ కోల్పోయినా తిరిగి వరుస విజయాలతో నిర్మాతగా - పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తున్నాడు.
ప్రస్తుతం తమ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమా తెరకెక్కుతుంది. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హౌస్ నుండి రానున్న 25వ సినిమా. ఈ సందర్భంగా ఈ చిత్ర ఆడియోని ఘనంగా నిర్వహించే ప్లాన్ లో రాజుగారు ఉన్నట్టు తెలుస్తుంది.
తమ హౌస్ నుండి తెరకెక్కిన మిగిలిన 24 సినిమాల హీరోలను ఈ వేడుకకి ఇన్వైట్ చేసే పనిలో వున్నాడట. ఈ వార్తగనుక నిజమైతే ఇటీవల కాలంలో జరగబోయే అతిపెద్ద ఆడియో ఫంక్షన్ ఘనత ఈ చిత్రానికి దక్కుతుంది. దాదాపు తెలుగు టాప్ హీరోలంతా రాజుగారి బ్యానర్ లో నటించిన వారే. ఇదే కాన్సెప్ట్ లో ఈగ సినిమాకు తన ముందు సినిమాల హీరోలను ఇన్వైట్ చేశాడు రాజమౌళి. ఆ మాదిరిగానే ఈ ఆడియో ఫంక్షన్ కూడా విజయవంతం కావాలని కోరుకుందాం.