దర్శకుడిగా మెప్పిస్తూనే, నిర్మాతగానూ కొత్తతరాన్ని ప్రోత్సాహించే ఉద్దేశంతో మారుతి తన సొంత బ్యానర్లో మొదట్నుంచీ సినిమాలు నిర్మిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ నిర్మాత దిల్రాజు, శ్రేయాస్ శ్రీనివాస్లతో కలిసి నిర్మించిన సినిమా ?రోజులు మారాయి?. కొత్త దర్శకుడు మురళి తెరకెక్కించిన ఈ సినిమాకు మారుతి స్వయంగా కథ, స్క్రీన్ప్లే అందించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (జూలై 1న) పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది.
ఇక ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరైన దిల్రాజు కొద్దిరోజుల క్రితం సినిమా అంతా చూశాక మారుతి టీమ్కు ఓ సలహా ఇచ్చారట. సుమారు 2 గంటల 25 నిమిషాలకు పైనే ఉన్న నిడివిని, 15 నిమిషాల పాటు తగ్గించమని తెలిపారట. సెకండాఫ్లో రన్టైమ్ విషయమై దిల్రాజు ఇచ్చిన ఈ సలహా సినిమాకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు మారుతి తెలిపారు. కొన్ని కథకు అవసరం లేని సన్నివేశాలను తొలగించగా, ఇప్పుడు నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ఫుల్ కామెడీగా తెరకెక్కింది.