నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకొన్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ గౌతమి పుత్ర.. ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు క్రిష్ డిసైడ్ అయ్యాడు. అయితే, బిజీ షెడ్యూల్ వల్ల దేవి శ్రీ.. గౌతమి పుత్ర.. చిత్రబృందం కోరిన సమయానికి ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడట. అందుకే బాలయ్య చిత్రం నుంచి దేవి తప్పుకొన్నాడు.
అయితే, దేవిశ్రీ స్థానంలో కొత్త సంగీత దర్శకుడి కోసం వేట మొదలుపెట్టిన గౌతమి పుత్ర.. చిత్రబృందం వేరొక సంగీత దర్శకుడిని సంప్రదించి ఫైనలైజ్ చేసినట్టు సమాచారమ్. అతనే.. చిరంతన్ భట్. కంచె చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు ఇతడే. ?కంచె?లో నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా అందించాడు చిరంతన్. కంచెలాగే ?గౌతమి పుత్ర.. ? కూడా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో.. క్రిష్ చిరంతన్ భట్ కి ఓటేసినట్టు సమాచారమ్. మొదట బాలయ్య చిత్రం కోసం ఇళయరాజాని కానీ, కీరవాణిని గానీ రంగంలోకి దించుతారని భావించారు. కానీ, క్రిష్ తనదైన మార్క్ తో మరోసారి చిరంతన్ భట్ కి అవకాశం ఇచ్చారు.