ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాతగా తెరకెక్కించిన ?జర్నీ? సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవ్వరి ఊహకూ అందని విజయం సాధించిన ఆ సినిమాలో ఓ జోడీగా నటించిన జై-అంజలిలకు చాలా పేరొచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఈ ఇద్దరూ మళ్ళీ ఓ కొత్త సినిమా కోసం జతకట్టారు. జై, అంజలి హీరో, హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమా నేడు సెట్స్పైకి వెళ్ళింది. తమిళంలో కొద్దికాలంగా బాగా పాపులర్ అయిన రొమాంటిక్ హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సినీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇవ్వాళే సెట్స్పైకి వెళ్ళిందని, హీరో జైతో మళ్ళీ ఐదేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అంజలి, ఈ సినిమాతో ఎలాగైన మళ్ళీ తన స్టార్ స్టేటస్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.