మిర్చి, శ్రీమంతుడ? సినిమాలతో తెలుగులో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, తాజాగా ఎన్టీఆర్తో జనతా గ్యారెజ్ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే కొరటాల, రెండు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇందులో మొదటిదైన డీవీవీ దానయ్య నిర్మించే సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది.
కొరటాల శివ ఇప్పటివరకూ చేసిన మూడు సినిమాలకూ సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాదే ఈ నాలుగో సినిమాకూ సంగీతం సమకూరుస్తారని డీవీవీ దానయ్య టీమ్ తెలిపింది. నవంబర్ నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయని టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ హీరోగా ఈ సినిమా ఉండొచ్చనేది ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.