ప్రస్తుతం నాగ చైతన్య సరసన ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న కృతి సనాన్ ('నేనొక్కడినే' ఫేం) బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' ఫేం రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. షారుఖ్ ఖాన్ హీరోగా రోహిత్ మార్చి నుంచి ఓ భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇందులో యువ నటుడు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. అతని సరసన కథానాయికగా కృతిని తాజాగా ఎంచుకున్నారు. ఈ సినిమా తన కెరీర్ కి పెద్ద మలుపు అవుతుందని ఈ పొడుగు సుందరి భావిస్తోంది.
kritisanon, bollywood, rohitshetty, varundhawan,