పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ.. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భామ మలైకా అరోరా ఖాన్. ఈమె భర్త అర్బాజ్ ఖాన్. ఈయన మెగాస్టార్ చిరంజీవి మూవీ జై చిరంజీవలో మెయిన్ విలన్. వీళ్లిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు వీరు విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరికీ ఇప్పటికి పెళ్లయి అక్షరాలా 17 సంవత్సరాలు పూర్తయింది. ఇద్దరి వయసూ 48 ఏళ్లే.
ఈ వయసులోనూ వీరు విడాకులు తీసుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరమే. అయితే.. ఇదే జరనుందని టాక్ వినిపిస్తోంది. 15 ఏళ్ల తమ వివాహ బంధఆనికి ఫరాన్ అక్తర్ - అధునాలు రీసెంట్ గా గుడ్ బై చెప్పేశారు. వారి తర్వాత బాలీవుడ్ లో విడాకులు తీసుకోనున్న జంటగా మలైకా - అర్బాజ్ లు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ ను తీసుకుని.. బాంద్రాలోని ఇంటి నుంచి విడిగా వెళ్లిపోయిందట. ఖర్ లో నివసిస్తున్న ఆమె చెల్లి అమ్రితా అరోరా ఇంట్లోనే.. ప్రస్తుతం మలైకా ఉంటోందని తెలుస్తోంది.
అయితే.. ఇందుకు కారణం కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం యూకేకి చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ తో మలైకా అరోరా డేటింగ్ సాగిస్తోందని.. ఆ విషయంలోనే ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నా ఇలా బాలీవుడ్ తారలు విడాకుల బాట పట్టడం ఆశ్చర్యకరమే