నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ?ఎవడే సుబ్రమణ్యం? నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ?జెంటిల్మన్? వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమా ?మజ్ను?ను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు. ?ఉయ్యాల జంపాల?తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ?మజ్ను? సినిమాకు సంబంధించిన ఓ కొత్త షెడ్యూల్ను అరకులో మొదలుపెట్టారు.
ఇప్పటికే షూటింగ్ కూడా సగం భాగం పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమా అరకు షెడ్యూల్తో చివరి దశకు చేరుతుందని తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రితం విడుదలైన ఫస్ట్లుక్ కూడా నాని మార్క్ ఎంటర్టైనర్గా సినిమా నిలవనుందన్న ఫీలింగ్ తెచ్చిపెట్టేసింది. నాని స్టైల్లో కామెడీకి పెద్ద పీట వేసే రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రచారం పొందుతోన్న మజ్నును కిరణ్ నిర్మిస్తున్నారు. నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.