మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి తనయుడు నిఖిల్కుమార్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ?జాగ్వార్?. దాదాపు 75కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్లుక్, టీజర్ని జులై 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు.
బాలకృష్ణతో ?మిత్రుడు? తీసిన ఎ. మహదేవ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. దీప్తి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ పొటోగ్రఫి అందిస్తున్నాడు. తమన్ స్వరాలు సమకురుస్తున్నాడు.