ఇండస్ట్రీలో హీరోలకంటే హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. కథానాయిక విషయాలలో పోటీ కూడా చాలా వరకు పెరిగింది. దీంతో హీరోయిన్స్ సినిమా సినిమాకి చాలా కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం అందంలోనే కాకుండా అన్ని తరహా పాత్రలను చేస్తూ మెప్పిస్తున్న హీరోయిన్స్ లలో నిత్య మీనన్ ఒకరు. ఈ రోజుల్లో గ్లామర్ పాత్రలతో హీరోయిన్స్ ఎక్కువగా ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. కానీ నిత్య మాత్రం ఘాటైన గీతని అస్సలు దాటకుండా కేవలం తన నటనతోనే ఇమేజ్ సంపాదించుకుంది.
అయితే అమ్మడికి పాత్రలు కూడా చాలావరకు సినిమాలో ముఖ్యమైనవే వస్తున్నాయని ఆమె చేసే పాత్రలను చూస్తే తెలుస్తోంది. రీసెంట్ గా నిత్య కు మరో కొత్త తరహ పాత్ర చేసే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. త్వరలో వెంకటేష్ కొత్త సినిమాలో అమ్మడిని సెలక్ట్ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్ - ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించబోయే సినిమాలో నిత్య కి చాలా కీలకమైన రోల్ ఇచ్చారట. అందులో లవర్ గానే కాకుండా ఫ్యామిలీ లో ఉండే ఒక అల్లరి పిల్లగా కనిపించనుందట అ బ్యుటిఫుల్ గాళ్.
ఒకే పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టమనే చెప్పాలి. ఈ రోజుల్లో అలాంటి ముఖ్యమైన పాత్రను చేయాలంటే నిత్యనే కరెక్ట్ ఇక ఈ విషయంపై ఒక క్లారిటీ రావాలంటే వెంకీ సినిమా మొదలుపెట్టేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే గతంలో కిషోర్ తిరుమల చేయాల్సిన సినిమాలో కూడా వెంకీ పక్కన నిత్యనే హీరోయిన్. మరి ఇప్పుడు ఏ సినిమాలో హీరోయిన్ గా చేస్తోందీ వివరాలు తెలియలేదు