కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఇంకా అధికారికంగా టైటిల్ కూడా ఖరారు చేయలేదు. అజ్నాతవాసి అనే టైటిల్ ఓకే అయినప్పటికీ అది అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంకా లాంచ్ చేయలేదు. కానీ ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రానికి బిజినెస్ మాత్రం చకచకా జరిగిపోతోంది. బిజినెస్ ఆఫర్లు కూడా కళ్లు చెదిరేలా ఉంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా అజ్నాతవాసి శాటిలైట్ డీల్ ఓకే అయిపోయిందట. ఈ చిత్ర శాటిలైట్ హ్కుల్ని జెమిని టీవీ రూ.19.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది నాన్-బాహుబలి రికార్డు అని అంటున్నారు. జెమినితో పాటుగా మా టీవీ.. జీ తెలుగు ఛానెళ్లు కూడా హక్కుల కోసం గట్టిగానే పోటీ పడ్డాయట. రూ.14 కోట్ల దగ్గర మొదలైన బేరాలు చివరికి రూ.19.5 కోట్ల దగ్గర తెగినట్లు సమాచారం. నిర్మాత రాధాకృష్ణ రూ.20 కోట్లు ఆశించారట శాటిలైట్ హక్కులకు. చివరికి ఆయన కోరుకున్న ఫిగర్ కు దగ్గరగానే డీల్ ఓకే అయింది.
కేవలం శాటిలైట్ హక్కులతోనే రూ.19.5 కోట్లు రాబట్టి అజ్నాతవాసి కి ఇంకా డిజిటల్ హక్కుల రూపంలోనూ భారీగానే ఆదాయం వచ్చే అవకాశముంది. మరోవైపు హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా కూడా నిర్మాతకు భారీగానే ముట్టిందట. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు దాదాపు రూ.25 కోట్ల దాకా పలుకుతున్నాయట. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ రూ.150 కోట్లకు చేరువగా వెళ్లే అవకాశముంది.