Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Feb-2017 14:20:31
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పూరీ జగన్నాధ్ కూడా ఉంటాడు. కానీ కొన్నేళ్లుగా పూరీ నుంచి సరైన సినిమా ఏదీ రాలేదు. టెంపర్ తర్వాత ఈ మాస్ డైరెక్టర్ నుంచి ఆకట్టుకునే మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. టెంపర్ మూవీ సబ్జెక్ట్ కూడా పూరీది కాదు. ఛార్మి లీడ్ రోల్ లో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ జ్యోతి లక్ష్మి.. మెగా హీరో వరుణ్ తేజ్ తో లోఫర్.. నందమూరి కళ్యాణ్ రామ్ తో ఇజం.. ఇలా వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇజం తర్వాత ఇప్పటికి నాలుగైదు నెలలుగా ఖాళీగానే ఉన్నాడు పూరీ జగన్నాధ్. సినిమా షూటింగ్ లేకుండా ఇంత లాంగ్ గ్యాప్ పూరీ కెరీర్ లో ఎప్పుడూ ఉండదు. కొన్ని సబ్జెక్టులు ఓకే అయ్యాయనే టాక్ వచ్చినా మళ్లీ డ్రాప్ అయిపోతున్నాయి. ఇందుకు కారణం.. రెమ్యూనరేషన్ విషయంలో పూరీ నో కాంప్రమైజ్ అంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్.

తాజాగా వెంకీతో జన గణ మన విషయంలో కూడా ఇదే విషయంపై ప్రాజెక్ట్ డైలమాలో పడిందని అంటున్నారు. భారీ బడ్జెట్ మూవీకి సరే అనుకున్నా.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం పూరీ ఏ మాత్రం తగ్గడం లేదట. ఇప్పటికే స్టార్ హీరోలు ఈ దర్శకుడికి మొహం చాటేస్తున్నారు. చిరంజీవి.. ఎన్టీఆర్.. మహేష్ లతో మూవీస్ అనుకున్నా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు పూరి నెక్ట్స్ ఏ మూవీ స్టార్ట్ చేస్తాడా అనే ఆసక్తి అయితే ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

,  ,  ,  ,