రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ధృవ అనే టైటిల్ అనుకుంటున్నారు కానీ.. ఇంకాఫైనల్ చేయలేదు. ఇప్పటివరకూ తన కెరీర్ లో చరణ్ 10సినిమాలు చేయగా.. అందులో బాలీవుడ్ మూవీ జంజీర్ కూడా ఉంది.
ఓ బాలీవుడ్ మూవీ చేసిన అనుభవంతో.. చరణ్ ఇప్పుడు ఉత్తరాదికి దక్షిణాదికి ఫిలిం మేకింగ్ లో ఉన్న తేడాలు చెబ్తున్నాడు. నిర్మాణ విలువల పరంగా.. బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయట. ఇక్కడితో పోలిస్తే ప్రొడక్షన్ విషయంలో వాళ్లు చాలా ముందున్నారన్న చెర్రీ.. కొన్ని విషయాల్లో మాత్రం సౌత్ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయంటున్నాడు.
ముఖ్యంగా స్క్రిప్ట్స్ విషయంలో బాలీవుడ్ చాలా ఎదగాలట. మూవీలో ఉండే డ్రామాను వాళ్లు అంతాగా అడాప్ట్ చేసుకోలేదని చెబుతున్న చెర్రీ.. కేవలం మల్టీప్లెక్సుల కోసం సినిమాలు తీసే కల్చర్ సౌత్ లో లేదని గుర్తు చేశాడు. సినిమా అంటే అందరూ చూడదగ్గదే తప్ప.. ఇది మల్టీప్లెక్స్ జనాలకి ఇది మాస్ జనాలకి అనే వేరియేషన్ దక్షిణాది సినిమాల్లో ఉండదని ఇది మన సినిమాల గొప్పదనంగా చెప్పాడు రామ్ చరణ్.