మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్లో చేయనున్న చిత్రం గత నెల 30న లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించాలని భావించిన సుకుమార్ అందుకు గోదావరి జిల్లాలైతే భాగుంటుందని భావించి ఎక్కువ లొకేషన్లను అక్కడే నిర్ణయించారు.
కానీ తాజాగా సినీ వర్గాల్లో వినబడుతున్న వార్తలను బట్టి ముందుగా షూటింగ్ కేరళలో మొదలవుతుందని తెలుస్తోంది. మార్చి రెండవ వారంలో యూనిట్ కేరళ వెళ్లి అక్కడే ఒక ఫైట్ సీన్ షూట్ చేసి, తరువాత యధావిధిగా గోదావరి జిల్లాలో షూటింగ్ కొనసాగిస్తారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ భాద్యతలను పర్యవేక్షిస్తున్నారు