జబర్దస్త్ కామెడీషోతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యాంకర్ రేష్మి గౌతమ్ ప్రస్తుతం హీరోయిన్ గా సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గుంటూరు టాకీస్ సినిమాలో రేష్మి స్క్రీన్ ప్రెసెన్స్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రేష్మి మాస్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఈమె ఓ రొమాంటిక్ హర్రర్ చిత్రం తను వచ్చెనంట లో లీడ్ రోల్ చేస్తోంది.
చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందనే వస్తోంది. ఇకపోతే ఈ చిత్రం ఆగష్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రేష్మి గ్లామర్ రోల్ తో పాటు ఓ జాంబీ గానూ అలరించనుంది.