హీరోలు వేరు కాని వారి ఆటిట్యుడ్ ఒక్కటే. ఎందుకంటే అన్ని సినిమాలకూ దర్శకుడు పూర జగన్నాథ్ కాబట్టి.. ఆ సినిమాల్లో హీరోల క్యారక్టరైజేషన్ లన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ''రోగ్'' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఈ డ్యాషింగ్ డైరక్టర్. నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేశాడు.
చూడ్డానికి కొత్త హీరో.. కొత్త హీరోయిన్లు.. కాని మ్యాటర్ మాత్రం సేమ్ అలాగే ఉంది ఈ రోగ్ లో. అదిగో అక్కడ ఇషాన్ అనే కొత్త కుర్రాడు హీరో. ఆటో నడుపుకుంటూ ఉంటాడు. 10 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తా..నా వెనక్కి వచ్చి దాక్కుంటే వారిని కాపాడేస్తా అనేది అతని యాటిట్యూడ్. ఇక తెలుగులో ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేసిన మన్నరా చోప్రా అందాలను బాగానే చిందిస్తే.. మరో హీరోయిన్ ఏంజెలా క్రిసిలింజికి మత్తెక్కించింది. వారితో మనోడు పెదవులను టచ్ చేస్తూ సాగించే సీన్లను చూస్తే.. అబ్బో పూరి మార్కు రొమాన్స్ అనాల్సిందే.
ఇకపోతే హీరోలో యాటిట్యూడ్.. హీరోయిన్లలో గ్లామరసం పండించడం.. విలన్లు.. వారి బాడీ లాంగ్వేజులూ.. పూరి మార్కు సినిమా తరహాలోనే ఉన్నాయి. మరి ఈసారి పూరి ఈ రోగ్ తో హిట్టు కొడ్తాడేమో చూడాలి. కాకపోతే పూరి సినిమాల్లో కొత్తదనం అనేది కోరుకుంటే.. కేవలం హీరో హీరోయిన్లు ఫేసులు మాత్రమే మారతాయి