వరుస విజయాలతో స్టార్గా ఎదుగుతోన్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ త్వరలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించే సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ పలు కొత్తదనమున్న సినిమాలను చేస్తూ వస్తోన్న గౌతమ్, ఈ క్రమంలోనే తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వికటన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా తెలుగు వర్షన్కు సాయిధరమ్ తేజ్ను హీరోగా ఎంపికచేశారని సమాచారం. కాగా ఈ విషయమై టీమ్ దగ్గర్నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనుష్క, తమన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ మల్టీస్టారర్ ఓ సరికొత్త కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది.