ఫాదర్ సెంటిమెంట్ కథలకు తెలుగులో మళ్లీ కొత్త ఊపిరి వచ్చింది. అదీ.. నాన్నకు ప్రేమతో సినిమాతో! తండ్రీ కొడుకుల అనుబంధం అనే కాన్సెప్టుకు చెదలు పట్టలేదని నిరూపించిందా చిత్రం. బ్రహ్మోత్సవం కూడా ఫాదర్ సెంటిమెంట్ బాటలోనే నడిచింది.
ఇప్పుడు మరో సినిమా? ఇదే జోనర్లో రాబోతోంది. సాయిధరమ్ తేజ్ ? గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఠాగూర్ మధు నిర్మాత. రకుల్ ప్రీత్ సింగ్ని కథానాయికగా ఎంచుకొన్నారు. ఈ సినిమా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందట.
సాయి ?సుప్రీమ్? సినిమాలోనూ ఫాదర్ సెంటిమెంట్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి నాన్నకు ప్రేమ ఏ స్థాయిలో కురిపిస్తాడో చూడాలి. ఈ చిత్రానికి విన్నర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.